News September 9, 2024

1400 కొత్త బస్సు సర్వీసులు: మంత్రి

image

ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్రంలో కొత్తగా 1400 బస్సులను కొనుగోలు చేసి సర్వీసులను ప్రారంభించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు.

Similar News

News March 1, 2026

తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

image

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News February 28, 2026

RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

image

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌‌నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News February 28, 2026

RJY కల్తీ పాలు ఘటన.. 15 మందికి చికిత్స

image

RJY కల్తీ పాలు ఘటనలో బాధితులైన 15 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. వీరిలో కిమ్స్ లో 8 మంది, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు, డెంటల్‌లో ఇద్దరు, RACC, రవి చైతన్య ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.