News September 9, 2024
HYD: నగర వాసులకు ముఖ్య గమనిక

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో నిర్వహించే ముఖ్య సమావేశాల కారణంగా మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జీదారులంతా విషయాన్ని గమనించి బదులుగా బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 27, 2025
HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

వాట్సాప్లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
News December 27, 2025
గ్రేటర్ HYDలో నీటి కష్టాలు

HYDలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్లో 7.6 మీటర్లు, అమీర్పేటలో 10.5, కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 18.7, దారుల్షిఫా 7.1, టోలిచౌకి 3.8, రాజేంద్రనగర్ 7.6, శంషాబాద్ 4.6, వికారాబాద్ 4.8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నట్లు వెల్లడించారు.
News December 27, 2025
నేచురల్ AC కారిడార్గా మూసీ!

మూసీ పునరుద్ధరణలో ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్ ‘ABC’ (Active, Beautiful, Clean) మంత్రాన్ని జపిస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మూసీని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా నగరాన్ని చల్లబరిచే ఒక భారీ ‘నేచురల్ AC’ కారిడార్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నదికి ఇరువైపులా అత్యాధునిక ‘వర్టికల్ ఫారెస్ట్స్’ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.


