News September 9, 2024
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను అలర్ట్ చేశారు. రేపు ఉదయం 11.30 గంటల వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News January 13, 2026
రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’

ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మొదట సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఓల్డ్ లుక్తో రూఫ్ టాప్ ఫైట్ యాడ్ చేసిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News January 13, 2026
10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

TG: శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.
News January 13, 2026
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.


