News September 9, 2024
ఆదిమూలానికి న్యాయం చేయాలని వినతి

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ చేసి ఆయనకు న్యాయం చేయాలని దళిత నాయకులు కోరారు. ఈ మేరకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఆదిమూలం ఉన్నారని చెప్పారు. అలాంటి వ్యక్తిపై కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు.విచారణ జరిపించి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News December 29, 2025
చిత్తూరు SPని కలిసిన ట్రైనీ SP

చిత్తూరు SP తుషార్ డూడీని సోమవారం ట్రైనీ ఎస్పీ డా.తరుణ్ పహ్వ మర్యాదపూర్వకంగా కలిశారు. 2024 బ్యాచ్కు చెందిన ఆయన AP క్యాడర్కు ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల ప్రొబేషనరీ ట్రైనింగ్ నిమిత్తం చిత్తూరుకు చేరుకున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమస్యలను శ్రద్ధగా వినడం, వేగంగా పరిష్కరించడం ముఖ్యమని SP ఆయనకు సూచించారు.
News December 29, 2025
తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.
News December 29, 2025
26 మండలాలకు తగ్గనున్న చిత్తూరు జిల్లా

కొత్త చిత్తూరు జిల్లా 32 నుంచి 26 మండలాలకు పరిమితం కానుంది. <<18703423>>పుంగనూరు<<>> నియోజకవర్గం(6 మండలాలు)ను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య సైతం 7 నుంచి 6కు చేరుకుంది.


