News September 10, 2024

అల్లూరి: అలిగి పుట్టింటికి వచ్చి మృతి

image

గూడెం కొత్తవీధి మండలం చట్రాపల్లికి చెందిన పండన్న పెద్ద కుమార్తె కొర్ర కుమారి(20)కి రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం దోమలగొందికి చెందిన రాజుతో వివాహమైంది. భర్త తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారం రోజుల క్రితం కుమారి భర్తపై అలిగి చట్రాపల్లి పట్టింటికి వచ్చేసింది. కొండచరియలు పండన్న ఇంటిపై పడడంతో నిద్రలోనే ఆమె మృతి చెందింది. కుమారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 8, 2025

కైలాసగిరి రోప్‌వే నిర్వాహకులకు నోటీసులు

image

కైలాసగిరి రోప్‌వే వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్ ప్రణవ్ గోపాల్ శనివారం ఉదయం సంఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రోప్‌వే నిర్వాహకులకు నోటీసులు అందజేశామని, సమగ్ర దర్యాప్తు అయ్యేవరకు రోప్‌వే సేవలను నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రణవ్ గోపాల్ తెలిపారు.

News March 8, 2025

విశాఖ: తమకంటూ ఓ రోజు ఉందని తెలియని శ్రమజీవులు వీళ్లు

image

నేడు మహిళా దినోత్సవం. ప్రపంచమంతా మగువుల విలువ లోకానికి చాటి చెబుతోంది. కానీ తమ కష్టాన్ని గుర్తించే రోజు ఒకటుందని తెలియని శ్రమజీవులు వీళ్లు. శనివారం వేకువజామునే విశాఖలోని సిరిపురం, రైల్వే న్యూకాలనీ, రాంనగర్ ప్రాంతాల్లో ఇలా రోజువారీ పనుల్లో తలమునకలై కనిపించారు. పని మీద ధ్యాస, కుటుంబానికి భరోసా అందించాలనే ఆశ తప్ప విశ్రమించని శ్రామికులు. ఈరోజున శుభాకాంక్షలకు అత్యంత అర్హత కలిగిన మహిళామణులు వీళ్లు.

News March 8, 2025

విశాఖ: అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే ఆత్మహత్య

image

అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్‌లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.

error: Content is protected !!