News September 10, 2024

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో దొంగలు

image

విజయవాడ వరద ప్రభావిత కాలనీలలో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా బీరువాల్లోని నగదు, బంగారం, గ్యాస్ సిలిండర్లు కాజేస్తున్నారు. లూనా సెంటర్లో 10తులాల బంగారం. రూ.లక్షన్నర నగదు, వాంబే కాలనీలో 3తులాల బంగారంతో పాటు సింగ్ నగర్, తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలోని సొత్తు కాజేశారని కంటతడి పెడుతున్నారు.

Similar News

News September 13, 2025

గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

News September 13, 2025

ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

image

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

News September 12, 2025

కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.