News September 10, 2024
లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

మాజీ మంత్రి, BRS మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు. కాగా శ్వేతా మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మారెడ్డికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.
Similar News
News September 15, 2025
MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్నగర్లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
News September 15, 2025
MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.
News September 14, 2025
GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.