News September 10, 2024
13వ తేదీ లోపు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఈ నెల 13వ తేదీ లోపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆల్ ఇండియా రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News January 11, 2026
BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.
News January 11, 2026
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 11, 2026
అనంత: పండుగ ముంగిట విషాదాంతం

పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నిండింది. కూడేరు(M) జల్లిపల్లికి చెందిన ఉదయ్ కిరణ్(12) ఆటోలో ఆడుకుంటుండగా ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. ముందుకెళ్లి బోల్తాపడి బాలుడు మృతిచెందాడు. బ్రహ్మసముద్రం(M) పోలేపల్లి వద్ద BTP కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నీటిలో ఊపిరాడక కపటలింగనపల్లికి చెందిన నితిన్(15) మరణించాడు. అనంతపురం పోలీస్ కంట్రోల్ రూములో ఎస్సైగా పనిచేస్తున్న మోహన్ ప్రసాద్(61) గుండెపోటుతో మృతిచెందారు.


