News September 11, 2024

ఇప్పుడు ఎవరైనా కశ్మీర్‌కు స్వేచ్ఛగా వెళ్లొచ్చు: అజిత్ పవార్

image

దేశంలో ఎవరైనా నేడు స్వేచ్ఛగా కశ్మీర్ వెళ్లి రావొచ్చని ఎన్సీపీ నేత అజిత్ పవార్ గుర్తుచేశారు. తాను కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వెళ్లేందుకు కూడా భయపడ్డానంటూ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదులను అణచివేసింది. లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగరడం అనేది ఒకనాడు కల. నేడు అక్కడ జెండా రెపరెపలాడుతోంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

రోడ్ల స్థితిగతులపై కొత్త సిస్టమ్: పవన్ కళ్యాణ్

image

AP: పల్లె రోడ్ల స్థితిగతులు ప్రజలకు ముందుగా తెలిసేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను తీసుకురానున్నట్టు Dy CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెపండగ 2.0లో 4007 KM రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని చెప్పారు. నిర్మాణాలు నాణ్యతతో ఉండాలన్నారు. స్వమిత్వ పథకం ద్వారా గ్రామాల్లో MARకి కోటి మంది ఆస్తులకు యాజమాన్య హక్కు (ప్రాపర్టీ) కార్డులు అందించాలని సూచించారు.

News November 7, 2025

రైనా, ధవన్‌.. వీళ్లేం సెలబ్రిటీలు?: సజ్జనార్

image

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.

News November 7, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.