News September 11, 2024
నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక

తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు APకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం TGలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.
Similar News
News January 13, 2026
ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్!

TG: రాష్ట్రంలో పండగ వేళ ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల చేయడంతో షెడ్యూల్ రిలీజ్కు SEC సిద్ధమైంది. 1,2 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. FEB రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST, డెడికేషన్ కమిషన్ ఆధారంగా BC రిజర్వేషన్లను ప్రకటించనుంది.
News January 13, 2026
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే..!

ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల సాధ్యమైనంత మేరకు <<18842236>>డయాబెటిస్<<>>ను దూరం పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చాలా ముఖ్యం’ అని సూచిస్తున్నారు. మరోవైపు మీ శరీర బరువు అదుపులో ఉంచుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 60% వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
News January 13, 2026
చర్మం పొడిబారి రాలుతోందా?

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్ నూనె సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయాలి.


