News September 11, 2024
ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు

ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
Similar News
News February 13, 2026
అసెంబ్లీలో మార్కాపురం MLA సంచలన వ్యాఖ్యలు

తమ జాయింట్ కలెక్టర్(JC) సరిగా పనిచేయడం లేదని మార్కాపురం MLA కందుల అన్నారు. ‘తర్లుపాడు(M) పూతలపాడు రైతుల భూముల వివరాల్లో ఊరి పేరు పోతవరంగా మార్చారు. దీంతో ఆ భూములు దేవదాయ శాఖవిగా మారడంతో అమ్ముకోలేకపోతున్నారు. దీనిపై 67 అర్జీలు ఇస్తే ఒక్కటీ పరిష్కరించలేదు. దీంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మా జిల్లాలో JCకు 1100 ఫైల్స్ వస్తే 100 పరిష్కరించి మిగిలినవి చెత్తలో పడేశారు’ అని MLA ఆరోపించారు.
News February 13, 2026
ఒంగోలు: రేపటి నుంచే బీచ్ ఫెస్టివల్.. టైమింగ్స్ ఇవే!

ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్ ఈనెల 14, 15వ తేదీల్లో జరగనుంది. 14వ తేదీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 11గంటల వరకు, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజా బాబు చెప్పారు. హెలికాప్టర్ రైడింగ్, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.
News February 13, 2026
బీచ్ ఫెస్టివల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


