News September 11, 2024

అనంత: విద్యార్థి హత్య కేసు ఛేదించిన పోలీసులు

image

ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.

Similar News

News September 29, 2024

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్

image

గోరంట్ల మండలంలోని దిగువ గంగం పల్లి తండాలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతానికి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ మారుతి, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలపై నివేదికను అందజేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం తెలపడం మృతుల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

News September 29, 2024

ఘర్షణలో కిందపడి వ్యక్తి మృతి

image

పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకటేశ్-ఆదినారాయణ మధ్య చిన్నపాటి విషయంపై ఘర్షణ జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణను వెంకటేశ్ కిందకు తోసేశాడు. దీంతో ఆదినారాయణ కింద పడి మృతిచెందాడు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News September 29, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగు పాటు.. భార్య, భర్త మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పిడుగు పాటుకు గురై భార్య, భర్తలు దాశరథి నాయక్, దేవి బాయి మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు.