News September 11, 2024
నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్

AP: ఇవాళ్టి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.
Similar News
News January 12, 2026
పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

పంట అవశేషాలను కాల్చితే నేలలో కార్బన్ శాతం తగ్గిపోతుంది. నేల ఉపరితలం నుంచి 1cm లోపలి వరకు ఉష్ణోగ్రత 8 డిగ్రీలు పెరిగి నేలలో పంటకు మేలు చేసే బాక్టీరియా, ఫంగస్ నాశనమవుతాయి. వీటిని కాల్చేటప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల ఉపరితలంలో 5.5kgల నత్రజని, 2kgల భాస్వరం, 2.5kgల పొటాష్, 1kg సేంద్రియ కర్బనం నష్టపోతాం.
News January 12, 2026
నేడు వెనిజులా.. రేపు ఇరాన్.. తర్వాత..?

ఒక దేశాధ్యక్షుడిని అపహరించి, ట్రంప్ తానే వెనిజులాకు రాజునని ప్రకటించుకోవడం మధ్యయుగాల నాటి మొండితనాన్ని సూచిస్తోంది. ప్రజాస్వామ్యం కావాలనుకుంటే ఎన్నికలు నిర్వహించాలి కానీ, సద్దాం హుస్సేన్ ఉదంతంలా చమురు కోసం ఇలా దాడులు చేయడం సరికాదు. నేడు వెనిజులా, రేపు ఇరాన్, తర్వాత మరోటి. ఇలా అగ్రరాజ్య ఆధిపత్య ధోరణి ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతోందన్నది సామాన్యుడి అభిప్రాయం. మరి దీనిపై మీ Comment..
News January 12, 2026
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<


