News September 11, 2024

HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్

image

హైదరాబాద్‌ మెట్రో‌లో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో‌ సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 28, 2025

HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

image

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.

News December 28, 2025

సెట్విన్‌ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి అసద్ అల్టిమేటం!

image

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!

News December 28, 2025

సెట్విన్‌ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి అసద్ అల్టిమేటం!

image

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!