News September 11, 2024

BREAKING: రాష్ట్రంలో సెబ్ రద్దు

image

ఏపీలో SEB(స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో)ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో సెబ్‌ను రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో సెబ్‌లో పనిచేస్తున్న 4,393 మంది ఉద్యోగులను తిరిగి ఎక్సైజ్ శాఖలోకి తీసుకురానున్నారు. ఇకపై వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణలో విధులు నిర్వహించనున్నారు. అలాగే సెబ్ కింద ఉన్న 208 స్టేషన్లు ఇకపై ఎక్సైజ్ స్టేషన్లుగా ఉండనున్నాయి.

Similar News

News December 29, 2025

వాహనదారులకు అలర్ట్!

image

మొబైల్ నంబర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాహన యజమానులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లను కేంద్ర రవాణా శాఖ అలర్ట్ చేసింది. చాలామంది పాత నంబర్లను మార్చకపోవడంతో చలాన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి కీలక సమాచారం పొందలేకపోతున్నారని పేర్కొంది. వాహనదారులు Vahan, సారథి పోర్టల్స్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. <>వెబ్‌సైట్‌లో<<>> RC, Chasis, ఇంజిన్ నంబర్లతో దీనికి అప్లై చేయొచ్చు.

News December 29, 2025

NMDC స్టీల్ ప్లాంట్‌లో 100 పోస్టులకు నోటిఫికేషన్

image

ఛత్తీస్‌గఢ్‌లోని NMDC స్టీల్ లిమిటెడ్ 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 12, 13, 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఐటీఐ(COPA, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రికల్)ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://nmdcsteel.nmdc.co.in

News December 29, 2025

మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

image

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.