News September 11, 2024
గణేశుడి లడ్డూను పాడిన ముస్లిం సోదరులు

ప్రకాశం జిల్లాలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ వద్ద వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి లడ్డూను వేలం వేశారు. ముస్లిం సోదరులు షరీఫ్, నజీర్ రూ.33800లకు లడ్డూను దక్కించుకున్నారు. మతసామరస్యానికి ఇది నిదర్శనమని పలువురు వారిని అభినందించారు.
Similar News
News January 18, 2026
ప్రకాశం: ఫుల్గా తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.


