News September 11, 2024
లోకేశ్కు చెక్ అందించిన హీరో సాయి ధరమ్ తేజ్

ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏపీ మంత్రి లోకేశ్ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ను అందించారు. ‘ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన చెక్ను లోకేశ్ అన్నకు అందించా’ అని ట్వీట్ చేశారు. కాగా, తేజ్ను అభినందిస్తూ లోకేశ్ రిప్లై ఇచ్చారు.
Similar News
News August 25, 2025
డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్ వాయిదా: డీఈవో

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల వెరిఫికేషన్ను సోమవారం సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్కు సంబంధించిన తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
News August 25, 2025
అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలి: HC

హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వాటర్ బాటిల్కు రూ.100 తీసుకుంటున్నప్పుడు మళ్లీ విడిగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. ఛార్జీ తప్పనిసరి కాదంటూ గతంలో హైకోర్టు ఏకసభ్య ధర్మానసం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాలు పిటిషన్ వేశాయి. తాజాగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
News August 25, 2025
సింధు సత్తా చాటేనా!

నేటి నుంచి BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మొదలు కానుంది. మెన్స్ సింగిల్స్లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ టాప్ సీడ్ షియుక్వి(చైనా)తో తలపడనున్నారు. మహిళల విభాగంలో PV సింధు బల్గేరియాకు చెందిన కలోయానతో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలోనైనా సింధు ఫామ్ అందుకుంటారో చూడాలి. ఇక మెన్స్ డబుల్స్లో IND నుంచి సాయిరాజ్-చిరాగ్ జోడీ, ఉమెన్స్ డబుల్స్లో ప్రియా-శ్రుతి మిశ్రా, రుతుపర్ణ-శ్వేతపర్ణ బరిలో ఉన్నారు.