News September 11, 2024
అమిత్షా చేతికి వరద నష్టంపై నివేదిక

ఏపీ, తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక కేంద్ర హోంమంత్రి అమిత్షా చేతికి అందింది. రెండు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఈ రిపోర్టును షాకు అందించారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందాలు త్వరలోనే పూర్తిస్థాయి నివేదికలు ఇస్తాయని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు.
Similar News
News January 13, 2026
‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.
News January 13, 2026
పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 13, 2026
రాష్ట్రంలో రూ.3,538 కోట్లతో సోలార్ కాంప్లెక్స్

AP: తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్సోల్ సంస్థ రూ.3,538 కోట్లతో 8GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.


