News September 12, 2024
బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే?

ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
Similar News
News August 24, 2025
గగన్యాన్ మిషన్.. తొలి అడుగు విజయవంతం

గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్(IADT-01) విజయవంతమైంది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా క్యాప్సుల్ను పారాచూట్ల సాయంతో సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసింది. ఈ పరీక్షను IAF, DRDO, నేవీ, కోస్ట్ గార్డ్తో కలిసి ఇస్రో చేపట్టింది. కాగా ఇండియా మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు గగన్యాన్ మిషన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
News August 24, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో హీరో బాలకృష్ణ పేరు

నటసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా అభిమానులను అలరించడం, 15 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు NBK కావడం విశేషం. ఈ గుర్తింపు సాధించిన బాలయ్యను ఆగస్టు 30న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో సత్కరించనున్నారు.
News August 24, 2025
సీఎం రేవంత్కు KTR సవాల్

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ విసిరారు. ‘పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. 20 నెలల పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము CMకు ఉందా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన MLAలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అతలాకుతలం చేశారు. దుర్గంచెరువు FTLలో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?’ అని ప్రశ్నించారు.