News September 12, 2024

నేడు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

image

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ నష్టం అంచనా వేయనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ, బుడమేరు, వ్యవసాయ పంటలు పరిశీలించనుంది. అలాగే గుంటూరు జిల్లాలోని పెదకాకాని కాలువలు, దేవరాయబొట్లపాలెం పంటపొలాలు పరిశీలించి మంగళగిరి ప్రజలతో మాట్లాడనుంది.

Similar News

News January 23, 2026

వరుసగా 3 రోజులు సెలవులు!

image

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.

News January 23, 2026

APPLY NOW: SACONలో 36 పోస్టులు

image

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<>SACON<<>>) 36 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in

News January 23, 2026

వసంత రుతువులో ప్రకృతి ఎందుకు పులకరించిపోతుందో తెలుసా?

image

వసంత పంచమికి, ప్రేమ దేవుడు మన్మథుడితో సంబంధం ఉంది. శివుడి ధ్యానాన్ని భంగం కలిగించి, పార్వతీ దేవిపై ఆయనకు అనురాగం కలిగేలా చేయడానికి మన్మథుడు పూబాణాలు ప్రయోగించిన రోజు ఇదేనట. దీంతో శివుడు మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు. రతీదేవి వేడుకోలుపై తిరిగి ప్రాణం పోశాడు. ఈ కాలంలో కొత్త చిగుళ్లతో ప్రకృతి పులకించేలా చేసేది మన్మథుడని నమ్ముతారు. అందుకే ఈరోజును ప్రేమకు, సృజనాత్మకతకు ప్రతీకగా చెబుతారు.