News September 12, 2024
నల్గొండ: కష్టాలను దాటి ఎస్సై సాధించింది

ఆర్థిక ఇబ్బందులు, ఆపై కష్టాలు అయినా ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. వాటికి ఎదురు నిలిచి ఎస్సైగా నిలిచారు. ఆమెనే నల్గొండకు చెందిన మమత. ‘2016లో మెయిన్స్లో ఫెయిలైనా పట్టు వదలకుండా 2018లో ప్రయత్నించా. అప్పుడూ నిరాశే ఎదురైంది. లక్ష్యంపై ఇష్టంతో మరింత పట్టుదలగా మూడో సారి ఉద్యోగాన్ని సాధించాను’ అంటున్నారామె. తల్లిదండ్రులు, భర్త సహకారంతోనే ఎస్సై అయినట్లు మమత చెబుతున్నారు.
Similar News
News January 8, 2026
ఉరి వేసుకుని మిర్యాలగూడలో మహిళ ఆత్మహత్య

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డపాక జగదీష్ తన భార్య నాగమణితో కలిసి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం బాత్రూంకు వెళ్లిన నాగమణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 7, 2026
చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.
News January 7, 2026
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ పూర్తయిందని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.


