News September 12, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది: కేటీఆర్

TG: రుణమాఫీ కాలేదని, పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని KTR అన్నారు. ‘KCR రైతును రాజును చేస్తే, కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా బోగస్. రుణమాఫీలో పావు శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. రైతన్నలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 5, 2026
మిగిలింది 17 మంది మావోయిస్టులే.. పోలీసుల రిపోర్ట్

TG: 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉన్నట్టు కేంద్రానికి పంపిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పసునూరి నరహరి (సంతోష్) సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరిపైనా రూ.2కోట్ల 25లక్షల రివార్డు ఉంది.
News January 5, 2026
ఎవరో ఎందుకు.. సమస్యను మనమే పరిష్కరించుకోలేమా?

AP-TG మధ్య నదీ జలాల వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటుచేయగా, నల్లమల సాగర్పై ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. అయితే తెలుగువారి ఆత్మగౌరవమంటూ బీరాలు పలికే నాయకులు, మేధావులు కూర్చుని ఓ పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఢిల్లీవాళ్లే వివాదాన్ని తేల్చాలా? కడలిపాలయ్యే నీళ్లను ఉపయోగించుకునే తెలివితేటలు మనకు లేవా? సమాధానం చెప్పేదెవరు?
News January 5, 2026
‘రాయలసీమ ప్రాజెక్ట్’పై అసలేం జరిగిందంటే…

రాయలసీమకు సాగునీటి కోసం YS జగన్ CMగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా దీన్ని చేపట్టారని TG SCని ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని కేంద్రమూ APని ఆదేశించింది. మరోవైపు జి.శ్రీనివాస్(TG) అనే వ్యక్తి కేసు వేయగా పనులు ఆపేయాలని 2020 OCT 29న NGT తీర్పిచ్చింది. 2024లోనూ పనుల నిలుపుదలకు ఆదేశాలిచ్చింది. దీనిపై 2025 MARలో AP కౌంటర్ దాఖలు చేసింది. ఈనెల 22న NGTలో విచారణ జరగనుంది.


