News September 12, 2024

సీతారాం ఏచూరితో సంభాషణలు మిస్సవుతా: రాహుల్ గాంధీ

image

అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అనుచరులకు సానుభూతి వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి ఓ స్నేహితుడు. భారత్ అన్న ఆలోచనకు రక్షకుడు. దేశంపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తరచూ మా మధ్య జరిగే సంభాషణలను ఇకపై నేను మిస్సవుతాను’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ ఏచూరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 1, 2025

నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. పెన్షన్ల పంపిణీ

image

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

News September 1, 2025

టారిఫ్స్ లేకపోతే మన దేశం నాశనమయ్యేది: ట్రంప్

image

ట్రంప్ అధికార పరిధి దాటి టారిఫ్స్ విధిస్తున్నారంటూ <<17559172>>US కోర్టు<<>> ఇటీవల ఆక్షేపించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ‘టారిఫ్స్ వల్ల $ట్రిలియన్లు వచ్చాయి. అవి లేకుంటే మన దేశం పూర్తిగా నాశనమయ్యేది. మన మిలిటరీ పవర్ పోయేది. ఇది ర్యాడికల్ లెఫ్ట్ గ్రూప్ జడ్జిలకు తెలియదు. కానీ డెమోక్రాట్ ఒబామా నియమించిన ఒక్క జడ్జి మాత్రం దేశాన్ని కాపాడేందుకు ఓట్ వేశారు. అతడి ధైర్యానికి థాంక్స్’ అని వ్యాఖ్యానించారు.

News September 1, 2025

కాళేశ్వరంపై CBI విచారణకు నిర్ణయం.. ఇందుకేనా?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం CID లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం KCR అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.