News September 13, 2024
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న హత్యాయత్నం కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన న్యాయమూర్తి విచారణ అనంతరం ఆ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాతి విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.
Similar News
News January 13, 2026
కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.
News January 13, 2026
ప్రొద్దుటూరు నూతన DSPగా విభూ కృష్ణ

కడప జిల్లా ప్రొద్దుటూరు DSP భావనను అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విభూ కృష్ణను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డీఎస్పీ ఇతర పోలీసు అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి బహిరంగంగా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బదిలీ చేశారని తెలుస్తోంది. విభూ కృష్ణ ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా ఉన్నారు. త్వరలో DSP బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 13, 2026
కడప: మద్యం బాటిల్పై రూ.10 పెంపు!

కడప జిల్లాలో గతనెల 1,43,405 కేసుల లిక్కర్ (IML), 54,938 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.98.98 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9,658 కేసులు లిక్కర్, 3,991 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.7.23 కోట్ల ఆదాయం లభించింది. APలో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.


