News September 13, 2024

గుంటూరు: విద్యార్థులకు శుభవార్త చెప్పిన RBI

image

RBI 90వ వార్షికంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90పేరిట క్విజ్ పోటీలు నిర్వహించనుంది. గుంటూరు జిల్లాలోని అన్ని కాలేజీలలో18వేల మంది ఉన్నారు. పాల్గొనే వారు 2024 sep 1కి 25 ఏళ్లలోపు ఉండి, WWW.rbi90quiz.inలో ఈ నెల 17 లోపు అప్లై చేసుకోవాలి. పోటీలు ఈనెల 19-21తేదీ వరకు ఉ.9- రాత్రి 9వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.10లక్షలు,రూ. 8లక్షలు, రూ.6 లక్షలు నగదు ఇవ్వనున్నారు.

Similar News

News March 4, 2026

జీజీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రభుత్వ వైద్యశాల అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నైట్ షిప్ట్‌లలో విధులు నిర్వహించే విభాగాల వైద్యులు, క్యాజువాలిటి, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News March 4, 2026

గుంటూరు జిల్లాలో 5 రేషన్ దుకాణాలపై కేసులు

image

గుంటూరు జిల్లాలో 5 చౌకధరల దుకాణాల పై కేసులు నమోదు చేసినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 244 రేషన్ షాపులను తనిఖీ చేశామని, తనిఖీల్లో సరుకులో వ్యత్యాశం గుర్తించి పెదకాకాని మండలంలో 3, ఫిరంగిపురంలో 1, నల్లచెరువులో 1 షాపు పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్డుదారుల నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న 4 వాహనాలను పట్టుకున్నామన్నారు.

News March 4, 2026

పెదకాకానిలో విషాదం.. నాలుగేళ్ల బాలిక మృతి

image

పెదకాకాని మండల కేంద్రానికి చెందిన శిరీషా (4) బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శిరీషా ఆడుకుంటూ బూరను మింగింది. ఊపిరి ఆడక అస్వస్థతకు గురవడంతో గుంటూరు GGHకు తరలించారు. చికిత్స అందించినప్పటికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.