News September 13, 2024
రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. 4వేల కిలోమీటర్లకుపైగా రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పగా, ప్రాధాన్యతల వారీగా వాటిని బాగు చేయాలని సీఎం సూచించారు. వరద నష్టం అంచనాలను వేగంగా సిద్ధం చేయాలన్నారు.
Similar News
News November 11, 2025
బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..
News November 11, 2025
ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్వర్క్స్పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.
News November 11, 2025
జూబ్లీహిల్స్లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.


