News September 13, 2024

విరాట్ వచ్చేశాడు.. ప్రాక్టీస్ మొదలు

image

ఈమధ్య కాలంలో లండన్‌‌లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుల కోసం చెన్నైలో నెట్స్‌లో 45 నిమిషాల పాటు చెమటోడ్చారు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లందరూ సాధన చేశారు. ఈ నెల 19న చెన్నైలో బంగ్లాతో తొలి టెస్టు మొదలుకానుంది. నగరంలో విరాట్ మూడేళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు ఆడనున్నారు. అక్కడ 4 టెస్టుల్లో ఒక సెంచరీతో 267 పరుగులు చేశారు.

Similar News

News November 9, 2025

NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్‌నాథ్ సింగ్

image

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.

News November 9, 2025

సమాజం కోసం ఏర్పడిందే RSS: మోహన్ భాగవత్

image

RSS సమాజం కోసం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ దేనికీ వ్యతిరేకం కాదు. అది అధికారాన్ని కోరుకోదు. సమాజంలో ప్రాధాన్యతను ఆశించదు. దేశ కీర్తి పెంచేందుకు సేవ చేయాలని కోరుకుంటుంది. మొదట్లో RSSను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు’ అని అన్నారు. RSS 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

News November 9, 2025

డిసెంబర్ 15న IPL వేలం!

image

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్‌లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.