News September 13, 2024

మాపై ఆరోపణలు పచ్చి అబద్ధం: సెబీ చీఫ్

image

తమపై వచ్చిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని సెబీ చీఫ్ మాధబీ బుచ్ అన్నారు. సంస్థ రూల్స్, గైడ్‌లైన్స్ అన్నీ పాటించానని చెప్పారు. ‘మా IT రిటర్నులను మోసపూరితంగా పొందడం అక్రమం. ఇది ప్రాథమిక హక్కైన మా గోప్యత, IT చట్టాన్ని ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేశారు. సెబీలో పనిచేస్తూనే మాధబి తన అగోరా అడ్వైజరీ ద్వారా ICICI, M&M, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల నుంచి ఆదాయం పొందారని కాంగ్రెస్, హిండెన్‌బర్గ్ ఆరోపించడం తెలిసిందే.

Similar News

News September 15, 2025

వేరు శనగ దిగుబడి పెరగాలంటే..

image

వేరుశనగలో నత్రజని లోపిస్తే ఆకులు పసుపు పచ్చగా, భాస్వరం లోపిస్తే ఆకులు, కాండం ఎర్రగా మారి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వేరుశనగకు ఎకరాకు 8KGల నత్రజని అవసరం. దీనిని ఎకరాకు 18KGల యూరియా రూపంలోగానీ, 100KGల DAP రూపంలో గానీ విత్తనం విత్తుకునేటప్పుడే వేసుకోవాలి. పంటకు 16KGల భాస్వరం అవసరం. దీన్ని 100KGల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో లేదా 35KGల DAP రూపంలో ఆఖరి దుక్కిలో వెయ్యాలి. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది.

News September 15, 2025

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

image

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పలు సెక్షన్లపై స్టే విధించింది. ఆస్తిని వక్ఫ్‌కు అంకితం చేయాలంటే కనీసం ఐదేళ్లు ఇస్లాంను ఆచరించాలనే నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. 1932 నుంచి ఇప్పటివరకు వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని CJI గవాయ్ పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే చట్టాల అమలును నిలిపివేస్తామన్నారు.

News September 15, 2025

పులిపిర్లకు ఇలా చెక్ పెట్టేద్దాం

image

వివిధ ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్‌సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై అద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. • కలబందను పులిపిర్లపై రాస్తే కొద్దిరోజుల్లోనే రాలిపోతాయి. • ఆముదంలో బేకింగ్ పౌడర్ కలిపి, దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా పోతాయి.