News September 13, 2024
BREAKING: మరో అల్పపీడనం

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


