News September 13, 2024

విద్యార్థులకు మంచి బోధన అందించాలి: మంత్రి రాజనర్సింహ

image

ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారని, వారిని తమ పిల్లలుగా భావించి బోధన చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోల్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో అన్నారు. త్వరలో హెల్త్ కార్డుల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘోత్తంరెడ్డి, గుండు లక్ష్మణ్, మాణయ్య, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 29, 2024

రాష్ట్రపతి నిలయం కళా మహోత్సవానికి వర్గల్ నవోదయ విద్యార్థులు

image

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన అతిపెద్ద కళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారని ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవంలో 430 మంది పాల్గొంటున్నారు.

News September 29, 2024

సంగారెడ్డి: DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పొడిగింపు

image

డీఎస్సీ -2008కి ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పెంచుతున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రభుత్వ పనిదినాలైన సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,3,4,5 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

News September 28, 2024

MDK: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్.. నేడు లాస్ట్

image

డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీ కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 292 మంది అభ్యర్థులు ఉండగా, శుక్రవారం 132 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నేడు కూడా ప్రక్రియ కొనసాగనున్నది.