News September 14, 2024

అమలాపురం: అత్యాచారయత్నం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష

image

అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి వీర వెంకట సత్యనారాయణకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని రూరల్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఈ సంఘటన జరిగిందన్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించి అడ్డువచ్చిన అమ్మమ్మపై దాడి చేశారన్నారు.

Similar News

News March 13, 2026

తూ.గో జిల్లాలో నిరంతరాయంగా LPG సరఫరా

image

ఏపీ ప్రభుత్వం గృహ అవసరాలు & అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో పాటు LPG పంపిణీదారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదనీ జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్, కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.

News March 13, 2026

రాజమండ్రి: రేపు ‘జాతీయ లోక్ అదాలత్’

image

మార్చి 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, రంపచోడవరం పరిధిలోని కక్షిదారులు తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News March 13, 2026

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య

image

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి(55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. అయితే వైద్యులు రెడ్డి అనంత లక్ష్మికి చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.