News September 14, 2024
మంచిర్యాల, పెద్దపల్లిలోనూ వందేభారత్ ఆపాలని డిమాండ్

సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. TGలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఈ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మంగళవారం మినహా నాగ్పూర్లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుతుంది.
Similar News
News October 31, 2025
WWC: ఈసారి విశ్వవిజేత ఎవరో?

సెమీస్లో ఆసీస్పై గెలుపుతో హర్మన్ సేన నిన్న ఫైనల్లోకి అడుగు పెట్టి SAతో NOV 2న తలపడనున్న విషయం తెలిసిందే. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి.
1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా.   
News October 31, 2025
ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?

ధ్వజం అంటే పతాకం. ధ్వజస్తంభం ఉత్సవానికి సంకేతం. హైందవ సంస్కృతిలో దీని చుట్టూ ప్రదక్షిణ చేశాకే దైవదర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఆలయోత్సవాలు మొదలయ్యేటప్పుడు ఈ స్తంభంపై జయపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభం లేని ఆలయాలకు స్వాములు దేవాలయ గుర్తింపు ఇవ్వరనే నమ్మకం ఉంది. దీనిని ఆలయ హృదయంగా భావిస్తారు. ఇది భక్తులకు శక్తిని, శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠిస్తారు.
News October 31, 2025
ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.


