News September 14, 2024

వైద్యులు వర్షంలో ఉంటే నాకు నిద్ర పట్టలేదు: సీఎం మమత

image

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనలో న్యాయం కోసం నిరసనలు చేస్తున్న వైద్యుల వద్దకు బెంగాల్ CM మమత ఈరోజు వెళ్లారు. వారు వర్షంలోనే నిరసనలు తెలుపుతుండటంతో తనకు రాత్రంతా నిద్రపట్టలేదని తెలిపారు. ‘నిరసనలు తెలియజేయడం మీ హక్కు. వాటికి సెల్యూట్ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నా పదవి కంటే మీ గొంతుకే ముఖ్యం. మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తాను. నిందితుల్ని శిక్షిస్తాను. దయచేసి విధులకు హాజరుకండి’ అని కోరారు.

Similar News

News July 9, 2025

ఆమెకు ఐఫోన్, రూ.లక్షల్లో డబ్బు ఇచ్చా: యశ్

image

తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చానని, కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదని RCB బౌలర్ <<16985182>>యశ్ దయాల్ <<>>తెలిపారు. తన కుటుంబసభ్యుల చికిత్స పేరుతోపాటు, షాపింగ్‌కు కూడా తీసుకెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. పెళ్లి పేరుతో తనను వాడుకుని వదిలేశాడని యశ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News July 9, 2025

గుర్తుపట్టలేని లుక్‌లో స్టార్ హీరో

image

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న కొత్త మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తాజాగా ఈ సినిమాలో శివరాజ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని సీరియస్‌గా చూస్తున్న ఫొటోలో ఆయన గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వైశాక్ నిర్మిస్తున్నారు.

News July 9, 2025

బాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ‘కేజీ మామిడి రెండు రూపాయలా? ఇదేం దారుణం. మా ప్రభుత్వ హయాంలో రూ.22-29కి కొన్నాం. కర్ణాటకలో రూ.16 ఇచ్చి కేంద్రమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో బాబు గాడిదలు కాస్తున్నారా? మామిడికి కనీసం రూ.12 కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు’ అని బంగారుపాళ్యం పర్యటనలో ఫైరయ్యారు.