News September 14, 2024

అనంత: ప్రభుత్వ లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ అంత్యక్రియలు

image

బుక్కపట్నం మండలంలోని గరుగు తాండ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ శుక్రవారం విజయవాడలో గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాలతో ప్రభుత్వా లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

image

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

News January 20, 2026

జేఎన్‌టీయూ-ఏ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

News January 20, 2026

అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

image

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.