News September 14, 2024
అనంతపురం జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరా బంద్
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాగునీటి కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతం చేశారు. 63 పంప్ హౌస్లలో నుంచి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కార్మికులు ఇవాళ ప్రకటించారు. సత్య సాయి తాగునీటి పథకాన్ని 19 విభాగాలుగా విభజించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
Similar News
News September 29, 2024
ఘర్షణలో కిందపడి వ్యక్తి మృతి
పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకటేశ్-ఆదినారాయణ మధ్య చిన్నపాటి విషయంపై ఘర్షణ జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణను వెంకటేశ్ కిందకు తోసేశాడు. దీంతో ఆదినారాయణ కింద పడి మృతిచెందాడు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News September 29, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగు పాటు.. భార్య, భర్త మృతి
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పిడుగు పాటుకు గురై భార్య, భర్తలు దాశరథి నాయక్, దేవి బాయి మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు.
News September 29, 2024
అనంత: భార్య గొంతు కోసి భర్త పరార్.. మృతి
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన గుమ్మగట్ట మండలంలోని కలుగోడులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కలుగోడుకు చెందిన బోయజ్యోతి(26)ని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తిరిగి రాలేదని భర్త ఈ దారుణానికి వడిగట్టాడు.