News September 14, 2024
హిమాచల్ పరిస్థితి హరియాణాకు తీసుకురావద్దు: మోదీ

హిమాచల్ ప్రదేశ్ను కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీయించిందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్కు అధికారమిచ్చి అలాంటి పరిస్థితి హరియాణాకు తీసుకురావద్దని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో తిరిగి బీజేపీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కురుక్షేత్రలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓబీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాగా రాష్ట్రంలో 90 స్థానాలకు అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 10, 2025
చలి పులి దెబ్బ: ఇంటింటా దగ్గు, జలుబు శబ్దాలే!

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
News November 10, 2025
దేశంలోనే శ్రీమంతురాలైన రోష్నీ నాడార్ గురించి తెలుసా?

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో 5స్థానంలో నిలిచిన రోష్నీ నాడార్కు సుమారు రూ. 2.84 లక్షల కోట్ల సంపద ఉంది. 27 ఏళ్లకే HCL CEO బాధ్యతలు చేపట్టిన ఆమె సంస్థను లాభాల బాట పట్టిస్తూ ధనిక మహిళల్లో ఒకరిగా ఎదిగారు. మరోవైపు సామాజిక సేవలోనూ ముందున్నారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ జాబితాల్లో చోటు దక్కించుకున్న ఆమె గతేడాది ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్ డె లా లీజియన్ డి-హానర్’ అందుకున్నారు.
News November 10, 2025
మొంథా తుఫాన్.. 1,64,505 హెక్టార్లలో పంట నష్టం

AP: మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 1,64,505 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 31వేల హెక్టార్లలో, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావిత 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం.. ఇవాళ, రేపు పర్యటించి పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.


