News September 14, 2024
హిందూపురంలో CM చిత్రపటానికి పోలీసుల క్షీరాభిషేకం

హిందూపురం పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం ఎక్సైజ్ పోలీసులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు కమలాకర్, రాంప్రసాద్లు మాట్లాడుతూ.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖను విలీనం చేస్తూ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరణ చేయడం ఎంతో అభినందనీయమన్నారు.
Similar News
News January 19, 2026
122 అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 122 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
News January 19, 2026
అనంతపురం: 54 మంది జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

అనంతపురం జిల్లా పరిషత్ పరిధిలోని 54 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. జడ్పీ సీఈఓ శివ శంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
News January 19, 2026
మహిళల భద్రతకు అగ్రపీఠం: జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను పటిష్టం చేయాలని ఎస్పీ పి.జగదీష్ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించాలని సూచించారు. వేధింపులు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.


