News September 15, 2024
చింతపల్లి: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పట్టణ ప్రాంతంలో స్కూటీ బోల్తా పడి యువతి మృతి చెందింది. సెయింట్ ఆన్స్ స్కూల్ స్కూల్ ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో యువతి ధన (25) స్కూటీ అదుపుతప్పడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. గుంతల కారణంగా స్కూటీ అదుపుతప్పిందని, ఈ క్రమంలోనే ధన మృతి చెందినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.
Similar News
News January 21, 2026
విశాఖ: 15 ఏళ్లు దాటాయా.. లాస్ట్ ఛాన్స్

పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా జనన రిజిస్టర్లో నమోదు చేసుకోలేదా. రిజిస్ట్రేషన్కు నేటితో సమయం ముగియనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ పరిధిలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పేరు జనన రిజిస్టర్లో చేసుకునేందుకు జనవరి 21వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది. దీని కోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని జనన రిజిస్టర్ అధికారుల వద్ద అవకాశం కల్పించారు. ఒకవేళ చేయించుకోకపొతే వేంటనే చేయించుకోండి.
News January 21, 2026
24 నుంచి దురంతో ఎక్స్ప్రెస్కు 3 ఏసీ బోగీలు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో ఎక్సప్రెస్ రైలుకు 3AC మూడేసి అదనంగా జత చేస్తున్నట్లు ప్రకటించారు. (22203/22204) నంబర్లు గల ఈ రైలు 24, 25వ తేదీల నుంచి ప్రయాణికులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News January 21, 2026
స్టీల్ ప్లాంట్లో VRSకి గడువు పెంపు

స్టీల్ ప్లాంట్లో VRSకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. VRS దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది DEC 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం VRSకి ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 500 దరఖాస్తులు అందినట్లు సమాచారం.


