News September 15, 2024

ఖమ్మం: ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం మాది: భట్టి

image

ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం తమదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తామని, విద్యుత్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. గత పాలకుల లాగా రాష్ట్ర సంపదను దోపిడీ చేసేందుకు సిద్ధంగా లేమని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వాళ్లకు చంప దెబ్బ కొట్టేలా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

Similar News

News January 7, 2026

నేడు ఖమ్మానికి కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, నాయకులను సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఉదయం 10:30కు ఖమ్మం చేరుకుని రాపర్తినగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సర్పంచ్‌లకు సన్మానం, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

News January 7, 2026

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} నేలకొండపల్లిలో రోడ్డు భద్రత మాసోత్సవాల
∆} మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News January 7, 2026

గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం: కలెక్టర్

image

ఖమ్మం: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, పన్నుల వసూలు, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనలో బాధ్యతగా పనిచేయాలని వారికి సూచించారు.