News September 15, 2024
గణేష్ మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్పాల్

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
NZB: అపార్, యూడైస్ పనులను పూర్తిచేయండి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారులు, ప్రిన్సిపల్స్ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఈరోజు జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంటనే విద్యార్థుల అపార్, యూడైస్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ కచ్చితంగా ఆపార్, యూడైస్, పెన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు.
News November 4, 2025
పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి: NZB కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అన్ని మండలాల ఎంఈఓలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు.
News November 4, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్లోని వినాయకనగర్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.


