News September 15, 2024

అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి

image

నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈలు విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తరితరులు పాల్గొన్నారు.

Similar News

News December 31, 2025

చిత్తూరు: పింఛన్ల పంపిణీకి రూ.115 కోట్లు

image

చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం నుంచి మొదలైంది. జిల్లాలో 2,67,481 మందికి 27 రకాల పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.115.17 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని పీడీ శ్రీదేవి తెలిపారు.

News December 30, 2025

పుంగనూరు: బైకును ఢీకొన్న RTC బస్సు.. ఒకరు స్పాట్ డెడ్

image

పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న RTC బస్సు బైకును ఢీకొనడంతో గుడిసి బండకు చెందిన సోమశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 30, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

రవి సీజన్లో పంటల సాగు జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలకు అవసరమైన 2183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.