News September 15, 2024
నెల్లూరు: బామ్మర్దిని గొంతు నులిమి చంపిన బావ

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ HYD గచ్చిబౌలిలో హాస్టల్ నడుపుతున్నాడు. అయితే ఆన్లైన్ గేమింగ్తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. బామ్మర్ది యశ్వంత్ని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించాడు. తన స్నేహితుడు ఆనంద్, వెంకటేశ్తో కలిసి యశ్వంత్ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు.
Similar News
News January 1, 2026
నెల్లూరు జిల్లాలో 25మందికి జైలుశిక్ష

జిల్లాలో 18 ఏళ్ల లోపు ఉన్నవారిపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో కేసులు నమోదు చేస్తున్నారు. 2025లో 15 పోక్సో, రేప్ కేసులు నమోదయ్యాయి. 8 మర్డర్ కేసులు ఫైల్ చేశారు. ఇతర కేసులు 2 నమోదయ్యాయి. వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి కఠిన కారాగార శిక్ష 20 ఏళ్లు, నలుగురికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలుశిక్ష ఏడుగురికి పడింది. మొత్తంగా 25మంది జైలుకు వెళ్లారు.
News January 1, 2026
నెల్లూరు: ఇవాళ మీకు సెలవు ఇచ్చారా?

నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చాలామంది ఇవాళ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఆప్షన్ లీవ్ వాడుకోవచ్చు. ఏడాదికి 5ఆప్షన్ హాలిడేస్ ఉంటాయి. జిల్లాలోని కొన్ని స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ఇచ్చారు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
News December 31, 2025
నెల్లూరు : 2 నుంచి రీ సర్వే

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతోంది. AP రీసర్వే ప్రాజెక్టులో జిల్లా నందు 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి 26 గ్రామాలు, కావలి డివిజన్ నుంచి 26, గూడూరు డివిజన్ నుంచి 14, నెల్లూరు డివిజన్ 27 గ్రామాలు కలిపి 357270.62 ఎకరములు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వేలో పాల్గొనాలని జేసీ వెంకటేశ్వర్లు, DD వై.నాగశేఖర్ కోరారు.


