News September 15, 2024
నెల్లూరు: బామ్మర్దిని గొంతు నులిమి చంపిన బావ

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ HYD గచ్చిబౌలిలో హాస్టల్ నడుపుతున్నాడు. అయితే ఆన్లైన్ గేమింగ్తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. బామ్మర్ది యశ్వంత్ని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించాడు. తన స్నేహితుడు ఆనంద్, వెంకటేశ్తో కలిసి యశ్వంత్ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు.
Similar News
News December 31, 2025
నెల్లూరు జిల్లాలో ఇలా చేస్తే నెలకు రూ.25వేలు

నెల్లూరు జిల్లాలో స్వచ్ఛరథం ఆపరేటర్లకు ప్రభుత్వం నెలకు రూ.25వేలు ఇస్తుంది. అతను ఇంటింటికీ తిరిగి KG ఇనుము, స్టీల్ వస్తువులు రూ.20, పేపర్లు రూ.15, గాజు సీసా రూ.2చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త తీసుకుని దానికి తగిన సరకులు ఇవ్వాలి. జనవరి 4లోపు MPDO ఆఫీసులో అప్లికేషన్లు ఇస్తే 9న ఎంపిక చేస్తారు. కావలి, కోవూరు, ముత్తుకూరు, వింజమూరు, ఆత్మకూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో అవకాశం ఉంది.
News December 31, 2025
నాకేమీ గుర్తు లేదు.. సిట్ విచారణలో ప్రశాంతిరెడ్డి!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TDP కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు విచారించారు. YCP ప్రభుత్వంలో ఆమె TTD కొనుగోలు కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. కల్తీ గురించి ప్రశ్నించగా.. ‘4నెలలే ఆ పదవిలో ఉన్నా. ఐదేళ్ల కిందట జరిగినవి ఇప్పుడు గుర్తు రావడం లేదు’ అని ఆమె చెప్పినట్లు సమాచారం. చిన్న అప్పన్న తమ దగ్గర PAగా పనిచేయలేదని చెప్పారు.
News December 31, 2025
2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ : కలెక్టర్

జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ సంబంధిత గ్రామాల్లోనూ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


