News September 15, 2024

యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

image

యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్‌లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News March 1, 2026

GNT: గ్యాస్ డెలివరీ బాయ్స్‌కి జాయింట్ కలెక్టర్ వార్నింగ్

image

గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేయడం ఆపాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం LPGడిస్టిబ్యూటర్లు, చౌకధరల దుకాణదారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. IVRSసర్వేలో రెండు ప్రశ్నలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు. వృద్దులకు ఇంటికి రేషన్ సరఫరా చేయకపోవడం కారణంగా కూడా వ్యతిరేకత వస్తుందన్నారు.

News February 28, 2026

GNT: ఒకప్పటి ద(ర్జీ)ర్జానే వేరయా..!

image

కార్యం ఏదైనా కుట్టిన దుస్తులు అంటే గుర్తొచ్చేది దర్జీ. కాల క్రమేణా ప్రజలు రెడీమేడ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దర్జీ కూలీ, రెడీమేడ్ దుస్తులు అటు, ఇటుగా ఒకటే అవుతుండటంతో అప్పటికప్పుడు దొరికే రెడీమేడ్ దుస్తులు కొంటున్నారు. ఒకప్పుడు దర్జీకి కొలతలు ఇవ్వడం‌, స్టిచ్చింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? అని ఎదురు చూడటం అంతా ఆసక్తిగా ఉండేది. నేడు టైలర్స్ డే ఈ సందర్భంగా వారితో మీకు ఉన్న అనుబంధం కామెంట్ చేయండి.

News February 28, 2026

మంగళగిరి: జనసేన ఆఫీస్ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్?

image

మంగళగిరి జనసేన కార్యాలయంలో నీలాద్రి అనే వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు ఆరంభించారు. భద్రతా విభాగం రిజర్వు ఇన్స్పెక్టర్ పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. భద్రత వైఫల్యాల వల్లనే ఘటన చోటు చేసుకుందని నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నీలాద్రిని అరెస్ట్ చేశారు