News September 15, 2024
పల్నాడులో యాక్సిడెంట్.. ఏలూరు జిల్లావాసులు మృతి

పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మరణించారు. SI బాలకృష్ణ తెలిపిన వివరాలు.. నిడమర్రు మండలానికి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) కారులో గుంటూరు వెళ్లారు. యడ్లపాడు వద్ద టైరు పంక్చర్ కాగా టైరు మారుస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.
Similar News
News February 21, 2026
భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News February 21, 2026
ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.
News February 21, 2026
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ విద్యా అధికారి (ఆర్ఎస్ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.


