News September 15, 2024
విశాఖ: ఆ రైలు 5 గంటల ఆలస్యం

సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Similar News
News March 13, 2025
విశాఖ: పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని సూసైడ్

ఫిజిక్స్ పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుంది. సర్క్యూట్ హౌస్ సమీపంలో నివాసముంటున్న ఓ విద్యార్థిని ఫిజిక్స్ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి పరీక్ష బాగా రాయలేదని బాధపడగా ఆమె తల్లి ఓదార్చి నిద్రపోయింది. బుధవారం ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2025
‘జన్మభూమి’ ఎక్కేవారికి అలర్ట్

విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)ను సికింద్రాబాద్ వెళ్లకుండా దారి మళ్లించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి విశాఖలో బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్ వెళ్లకుండా చర్లపల్లి మీదుగా లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 26 నుంచి లింగంపల్లిలో బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్ రాకుండా చర్లపల్లి మీదుగా విశాఖ రానుంది.
News March 13, 2025
విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని వ్యవసాయ మరియు వాణిజ్య శాఖ అధికారులు గురువారం నాడు కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు( రూ/కేజీ)లలో టమాటా రూ.15, ఉల్లిపాయలు రూ.23/28 ,బంగాళాదుంపలు రూ.16, వంకాయలు రూ.34/40/46, బెండకాయలు రూ.46, మిర్చి రూ.28, బరబాటి రూ.36, గోరుచిక్కుడు రూ.36, బీట్రూట్ రూ.20, బీన్స్ రూ.52, కీర రూ.26, దేవుడి చిక్కుడు రూ.64, మునగ రూ.56, అరటికాయలు రూ.38, క్యారెట్ రూ.22/32గా నిర్ణయించారు.