News September 15, 2024
పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్కు అరకు ఎంపీ ప్రత్యేక చొరవ

పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్ కోసం అరకు MP చెట్టి తనూజా రాణి ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు రెండు రోజుల క్రితం మర్యదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పార్వతీపురంలో వందే భారత్కు హాల్ట్ కల్పించాలని కోరుతూ వినితిపత్రం అందజేశారు. ఆమె ప్రతిపాదనల మేరకు రైల్వే మంత్రి DRM కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పార్వతీపురం ప్రజలు అరకు MPకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Similar News
News January 18, 2026
చీపురుపల్లి: యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెడ్

చీపురుపల్లిలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన యువకుడు తన స్కూటీపై చీపురుపల్లి వైపు వెళ్తుండగా..మూడు రోడ్ల జంక్షన్ వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువ కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News January 18, 2026
VZM: కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 17, 2026
VZM: వాట్సాప్లో పోలీస్ సేవలు.. నంబర్ ఇదే!

విజయనగరం జిల్లాలో ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చని SP దామోదర్ శనివారం తెలిపారు. ‘మనమిత్ర’ విధానం ద్వారా FIR కాపీలు, ఈ-చలాన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 9552300009 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.


