News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.
Similar News
News December 27, 2025
ధనుర్మాసం: పన్నెండో రోజు కీర్తన

‘లేగదూడలను తలచుకొని గేదెలు కురిపించే పాలధారలతో వాకిళ్లన్నీ తడిసిపోతున్నాయి. ఇంతటి ఐశ్వర్యం కలిగిన గోపాలుని సోదరీ! బయట మంచు కురుస్తున్నా, మేమంతా వేచి ఉన్నాము. శ్రీరాముడు ఆనాడు రావణుడిని సంహరించిన వీరగాథలను మేమంతా భక్తితో పాడుతున్నాము. ఇంత జరుగుతున్నా నీవు మాత్రం నిద్ర వీడటం లేదు. నీ భక్తి పారవశ్యం మాకు అర్థమైంది. ఇకనైనా ఆ నిద్ర చాలించి, మాతో కలిసి ఆ మాధవుని సేవలో పాల్గొనవమ్మా!’ <<-se>>#DHANURMASAM<<>>
News December 27, 2025
H1B వీసా జాప్యాన్ని US దృష్టికి తీసుకెళ్లిన భారత్

H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్లో ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.
News December 27, 2025
T20ల్లో హర్మన్ ప్రీత్, షెఫాలీ రికార్డులు

ఉమెన్స్: SLతో జరిగిన 3వ T20లో IND ప్లేయర్లు పలు రికార్డులు సాధించారు. తాజా గెలుపుతో T20ల్లో అత్యధిక విజయాలు(77) అందించిన కెప్టెన్గా హర్మన్ ప్రీత్ నిలిచారు. తర్వాత AUS ప్లేయర్ మెగ్ లానింగ్(76) ఉన్నారు. మరోవైపు ఓ T20 మ్యాచ్లో అత్యధిక శాతం పరుగులు బాదిన బ్యాటర్గా షెఫాలీ(79*) నిలిచారు. ఆమె నిన్న SLపై జట్టు స్కోరు(115)లో 68.69% రన్స్ చేశారు. ఇప్పటి వరకు 2011లో హర్మన్ చేసిన 66.12% పరుగులే అత్యధికం.


