News September 15, 2024
నిఫా వైరస్తో కేరళలో వ్యక్తి మృతి

నిఫా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి మరణించారు. మళప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆ వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరణం తర్వాత పరీక్షల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. మృతుడితో కాంటాక్ట్లో ఉన్నవాళ్లని గుర్తించి అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురిని ఐసోలేషన్లో ఉంచామన్నారు.
Similar News
News January 11, 2026
పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.
News January 11, 2026
ఇక కేరళ వంతు.. BJP పవర్లోకి వస్తుంది: అమిత్ షా

2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో BJP అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘2014లో 11% ఓట్లు వస్తే 2024లో 20%కి పెరిగాయి. త్వరలో 40% సాధిస్తాం. కేరళ వంతు వచ్చింది. ఇక్కడ కచ్చితంగా బీజేపీ సీఎం ఎన్నికవుతారు’ అని చెప్పారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ-ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.
News January 11, 2026
దేశంపై నమ్మకం ఉంచండి: పీయూష్ గోయల్

భారత్తో ట్రేడ్ డీల్ ఆలస్యం కావడానికి మోదీ ఫోన్ <<18809902>>చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. దేశంపై నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు. ‘మీ దేశాన్ని, మాతృభూమిని విశ్వసించండి. విదేశీయుల ప్రకటనలను కాదు. ట్రేడ్ డీల్ చిక్కుల గురించి మీడియా ముందు మాట్లాడుకోరు. రహస్యంగానే చర్చిస్తారు’ అని ఆయన స్పష్టం చేశారు.


