News September 16, 2024

సైబర్ క్రైమ్.. రోజుకు రూ.3 కోట్లు స్వాహా

image

TG: రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సైబర్ నేరస్థులు అమాయక ప్రజల నుంచి రూ.1,085 కోట్లు స్వాహా చేశారు. రోజుకు రూ.3కోట్ల పైనే దోచేశారు. బాధితుల్లో ఎక్కువగా ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు ఉన్నారు. పార్ట్ టైమ్ జాబ్స్, అధిక వడ్డీ పేరుతో బురిడీ కొట్టించారు. గత 8 నెలల్లో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 5,500, హైదరాబాద్‌లో 2,140, రాచకొండలో 1,500 సైబర్ కేసులు నమోదయ్యాయి.

Similar News

News January 16, 2026

కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

image

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.

News January 16, 2026

T20 వరల్డ్‌కప్‌లో సుందర్ ఆడటం కష్టమే!

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ గాయం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్‌కప్‌కు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.

News January 16, 2026

గ్రీన్‌లాండ్‌కు భారీగా యూరోపియన్ సైనిక బలగాలు

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ <<18784880>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో యూరోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్‌కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే సహా పలు దేశాలు గ్రీన్‌లాండ్‌కు సైనిక బలగాలను పంపుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సైనికులు గ్రీన్‌లాండ్ రాజధాని నూక్ చేరుకోగా, జర్మనీ సైతం సైనిక బృందాన్ని మోహరించింది. నాటో దేశాల ఐక్యతను చూపించేందుకే ఈ బలగాల మోహరింపు అని సమాచారం.