News September 16, 2024
కొత్తవలస: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే

కొత్తవలస టౌన్ వెంకట శివానగర్లో ఆదివారం గొలగాని పావని<<14110348>> ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను నిర్లక్ష్యం చేయడంతో బాధితురాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్గా పని చేస్తున్న భర్త ఆమెను ఈ మధ్య తరచూ వేధించేవాడు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నిర్లక్ష్యంతో ముగ్గురి జీవితాల్లో విషాదం నెలకొంది.
Similar News
News October 2, 2025
మహానీయుల ఆశయ సాధనకు కృషి చేయండి: VZM కలెక్టర్

నేటి తరానికి స్పూర్తి ప్రదాతలు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి అని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం విజయనగరం కలక్టరేట్ ఆడిటోరియంలో జాతి పిత మహత్మ గాంధీ, మాజి ప్రదాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆశయాల సాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
News October 2, 2025
గోవిందపురం: రేబిస్ లక్షణాలతో మృతి

సంతకవిటి మండలం గోవిందపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు (37) రాబిస్ లక్షణాలతో మృతి చెందాడు. లింగంనాయుడికి ఆగస్టు 30న వీధి కుక్క కరిచింది. దీంతో PHCలో మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కాగా.. రాబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లింగంనాయుడు కొద్ది రోజుల్లో సింగపూర్ వెళ్లబోతున్న తరుణంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
News October 2, 2025
జిల్లా అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలి: VZM కలెక్టర్

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా.. ఆ ఇద్దరు మహనీయులకు నివాళి అర్పించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొనాలని ఆదేశించారు.