News September 16, 2024

కొత్తవలస: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే

image

కొత్తవలస టౌన్ వెంకట శివానగర్‌లో ఆదివారం గొలగాని పావని<<14110348>> ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను నిర్లక్ష్యం చేయడంతో బాధితురాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త ఆమెను ఈ మధ్య తరచూ వేధించేవాడు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నిర్లక్ష్యంతో ముగ్గురి జీవితాల్లో విషాదం నెలకొంది.

Similar News

News October 15, 2024

సిరిమానోత్సవంలో ప్రజా ప్రతినిధుల సందడి

image

పైడితల్లి సిరిమానోత్సవ ఘట్టంలో పలువురు ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, తదితరులు సిరిమానుతో పాటు తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిరిమాను ఘట్టం ముగింపు వరుకు పర్యటించి సందడి చేశారు.

News October 15, 2024

విజయనగరంలో RRR సెల్ఫీ

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజయనగరం పట్టణంలో మంగళవారం సందడి చేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరి మానోత్సవానికి విచ్చేసిన ఆయన అమ్మవారి దర్శనం అనంతరం.. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన సిరిమానోత్సవంలో పలువురు కోరిక మేరకు సెల్ఫీలు దిగి సందడి చేశారు.

News October 15, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇక నుంచి వారు జిల్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యం కానున్నారు.